Sunday, November 30, 2008

అశ్రు నివాళి

తీవ్రవాద దాడుల్లో వీర మరణ మొందిన అమర జవానులకు,అమాయక ప్రజలకూ అశ్రు నివాళి .
ఇటువంటి సమయంలో తిలక్ గారి" ఆర్తగీతం " గుర్తు చేసుకోకుండా వుండలేక పోతున్నా .ఐతే అక్కడక్కడా కొంత భాగాన్ని ఎడిట్ చేసినందుకు క్షమించాలి .

నా దేశాన్ని గూర్చి పాడలేను ,నీ ఆదేశాన్ని మన్నించలేను .
ఈ విపంచికకు శృతి కలపలేను ,
ఈ రోజు నాకు విషాద స్మృతి ,విధి తమస్సులు మూసిన దివారుంధతి
నా ఎడద మ్రోడైన ఒక దుస్థితి .
గత చార్రిత్రక యశః కలాపమ్ము వివరింపకు,
బహుళ వీరానేక గాధాసహస్రమ్ము వినిపిమ్పకు
ఇంక నన్ను విసిగింపకు .

నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను ,
సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును ,
మంటలో అంతరాంతర దగ్దమైన బూడిదను .

ఈ రోజు నేను చూసిందేమి ?
విధి ఇన్ని కత్తులను దూసినదేమి?
జాగృతి హేతి వాదరల రుధిరమేమి ?

ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి ?ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి ?
ఏ బుద్ధదేవుడి జన్మ భూమికి గర్వ స్మృతి ?

ఈ ఆర్తి ఏ సౌదాంతరాలకు పయనింపగలదు ?
ఏ రాజకీయ వేత్త గుండెలను స్పృశించ గలదు ?
ఏ భోగవంతుని విచలింప చేయగలదు ?
ఏ భగవంతునికి నివేదించుకోగలదు .......?

నన్ను నిర్భందించకు నేస్తం
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను
మానవునిగా శిరసెత్తుకు తిరగలేను
ఈ నాగరికతారణ్యవాసం భరించలేను .

2 comments:

  1. బాగా సరియైన సమయంలో మంచి కవితను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదములు.

    ReplyDelete