
యయాతి పుణ్య ఫలంగా అతనికి సిద్ధలోక ప్రాప్తి కలుగుతుంది .ఐతే కొన్నాళ్ళకు తన తపస్సును ప్రశంసించుకొని , ఇతరుల తపస్సును చులకనగా చూడటం వల్ల అతని పుణ్యం క్షీణించి యయాతి సిద్ధలోకం నుండి క్రిందకు పడిపోసాగాడు. ఇది చూసిన తోటి రాజులలో ఒకడైన అష్టకుడనే రాజు యయాతితో ...రాజా ! మీరు పడిపోకుండా ఇక్కడే ఉండేలాగ నా పుణ్యాన్ని మీకు ధారపోస్తాను అన్నాడు . అప్పటికే తన తప్పు తెలుసుకున్న యయాతి ఓ రాజా ! దానం అనేది కేవలం వేదవిదులైన బ్రాహ్మణులు , అశక్తులైన దీనులు మాత్రమే స్వీకరించాలి నేను ఆరెండూ కాదు కాబట్టి నీ దానాన్ని స్వీకరించే అర్హత లేదు కాబట్టి తనని క్రింద పడనీయమన్నాడు .
అక్కడే ఉన్న మరికొంతమంది రాజులను కూడా యయాతి తిరస్కరించాడు .అది చూసిన వశుమానుడనే మహారాజు ముందుకు వచ్చి యయాతి మహారాజా ! మీవంటి పుణ్యాత్ములు ఈలోకంలోనే ఉండాలి మీరు దానం స్వీకరించనన్నారు కనుక మీరు నాకు గుప్పెడు గడ్డిని ఇవ్వండి బదులుగా నా పుణ్యఫలం మొత్తం మీకిచ్చేస్తాను .మూల్యం చెల్లించారు కాబట్టి ఇది దానం కాదు అన్నాడు .
అప్పుడు యయాతి చిరునవ్వుతో తగిన వెల చెల్లించకుండా ఏ వస్తువును స్వీకరించినా అది కూడా దానం క్రిందకే వస్తుంది కాబట్టి వృధా ప్రయాస పడకండి . నా కర్మఫలాన్ని నన్నే అనుభవించనీయండి .....విధాత నిర్ణయించిన దానికి తలవంచుటయే నా ధర్మం అంటూ అందరికీ వినమ్రతతో చేతులు జోడించాడు .
** సాధారణంగా పల్లెల్లో కొబ్బరికాయలు , అరటిపళ్ళు , ఇంకా ప్రత్తి ...మొదలైనవి ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి .దాంతో ఇరుగుపొరుగు వారికీ , బంధువులకూ ...దేవుడికైతే ఒక రూపాయిచ్చి తీసుకెళ్ళమని అనటం అలవాటుగా ఉంటుంది . అది తప్పని చెప్పటం హరిదాసుగారి ఆంతర్యం .