Monday, July 16, 2012

తిరిగొచ్చిన బాల్యం!

నాన్నా...నాన్నా!
ఏంటి నాన్నా?
అదేంటి నాన్నా?
అది కాకిరా బాబూ....
అదేంటి?మళ్ళీ అడిగాడు కొడుకు.... అదికాకి నాన్నా...బదులిచ్చాడు తండ్రి.]
ఆమర్నాడు కొడుకు మళ్ళీ అడిగాడు.అదేంటి? అది కాకినాన్నా...
ప్రతిరోజూ వీధిఅరుగుమీద కూర్చుని ఒడిలోకొడుకుని కూర్చోబెట్టుకొని ఆడించడం...కావుకావుమని ఎదోక కాకివచ్చి చుట్టుపక్కల వాలటం....కొడుకు పదేపదే అదేంటి?అని అడిగేవాడు...తండ్రి ఓపిగ్గామళ్ళీ మళ్ళీ అడికాకి అని బదులిస్తూఉండేవాడు.

కొన్నేళ్ళు గడిచాయి కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు.పెళ్లైంది..కొడుకు పుట్టాడు.అతని తండ్రి ముసలివాడయ్యాడు.ఆస్తిపాస్తులన్నీ కొడుక్కి అప్పగించి బాధ్యత దించేసుకున్నాడు.ఐతే వృత్తిరీత్యా కొడుకుకోసం ఎవరొకరు ఇంటికి వస్తూండేవారు.ముసలితండ్రి....ఎవరుబాబూ వచ్చిందిఅని అడిగాడు కొడుకు విసుగ్గా వచ్చినతని పేరు చెప్పాడు.మర్నాడు తండ్రి మళ్ళీఅడిగాడు ఎవరూ వచ్చింది?అని.ఎవరైతే మీకెందుకండీ...తిని ఓమూల కృష్ణా రామాఅనుకొంటూ కూర్చోక...ఒకటే ఆరాలు పనీపాటా లేకుండా అంటూకేకలేశాడు కొడుకు.

ముసలితండ్రి ముఖం చిన్నబోయింది.వణుకుతున్న చేతులతో పైకండువా తీసి రాబోతున్న కన్నీటినివత్తుకున్నాడు.ఎందుకుతాతా ఏడుస్తున్నావ్అంటూ మనవడు ఒడిలో చేరాడు.ఏంలేదుబాబూ చిన్నప్పుడు మీనాన్న అదేమిటి? ఇదేమిటి? అని వందసార్లు అడిగినా నేను అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పేవాడిని.కాని ఇప్పుడు నేను ఒకసారి అడిగితేనే విరుచుకుపడుతున్నాడు అంటూ ఎంతో బాధగాచెప్పాడు.మనవడు తన చిట్టి చేతులతోతాతని ఓదార్చాడు.

మరికొన్నేళ్ళు కాలచక్రంలో తిరిగిపోయాయి.ఇప్పుడు కొడుకు ముసలి తండ్రి అయ్యాడు, మనవడు కొడుకు స్థానంలోకి వచ్చాడు. కంటిచూపు మందగించి ప్రతిదాన్నీ ఇదేమిట్రా అంటూ కొడుకును వేధించసాగాడు తండ్రి. కాని కొడుకు ఏమాత్రం కసురుకోకుండా అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెపుతూ తండ్రికి ఏలోటూ రాకుండాఅన్ని జాగర్తలూ తీసుకొంటూ చిన్న పిల్లాడిలా చూసుకొనేవాడు.

ఒకరోజు కొడుకు స్నేహితుడు అతడ్ని కలవటానికి ఇంటికివచ్చాడు.ఎవర్రా అదీ....అంటూ వివరాలుఅడగసాగాడు తండ్రి.ఏదో ముక్తసరిగా జవాబిచ్చిలోపలికెళ్ళిన అతను ఎలా భరిస్తున్నావురా బాబూ ఈముసలాయాన్నిఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించక అని విసుగ్గా అన్నాడు తన స్నేహితుడితో.
అదేంట్రా అలా మాట్లాడతావ్...మనల్ని పెంచి పెద్ద చేయడానికి అమ్మానాన్నా ఎంత కష్టపడి వుంటారు? మనల్ని ఎంత ప్రేమగా చూసేవారో,మనమెన్ని అల్లరిపనులు చేసినా ఓర్పుగా భరించేవారు.మనకు చదువుసంధ్యలు చెప్పించి,ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళూ మనకోసం కష్టపడి కూడబెట్టి,మనల్నిఅందలం ఎక్కించడంకోసం ఎలా వారి చెమటతో సోపానం ఏర్పరిచారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.ఇప్పుడు వారు మనపట్ల బాధ్యతలన్నీ నెరవేర్చి వయసుడిగి వృద్ధులైతే...వారు పనికిరానివారైనట్లుకాదు. వారికి వారిబాల్యం తిరిగొచ్చినట్టు. అందుకే మనం వారిని చిన్నపిల్లలతో సమంగా చూసుకోవాలి.

కొడుకు తనస్నేహితుడితో చెబుతున్న మాటలువిన్న తండ్రికి తన తండ్రిపట్ల తనెంత అనుచితంగా ప్రవర్తించింది గుర్తుకువచ్చి సిగ్గుతో కృంగిపోయాడు. తలపైకెత్తి కన్నీళ్ళతో....నాన్నా..ఏలోకంలో ఉన్నావో, నన్ను క్షమించు నాన్నా!ఆర్తిగా వేడుకున్నాడు. అలలా ఓ చిరుగాలి అతన్ని స్పృశించింది ఓదార్పుగా....నాన్న మనసులా....

**ఆదివారం సత్యమేవజయతే చూసినప్పుడు, తాము అడుక్కున్న డబ్బుతో కూడా తమను తరిమేసిన పిల్లలకు,మనవలకు ఏదైనా కొనుక్కుని తీసుకెల్తారని విన్నపుడు మనసు ద్రవించింది.అందుకే అన్నారు అమృతం తాగినవాళ్ళూ...దేవతలూ, దేవుళ్ళూ....అవి కన్నబిడ్డలకు పంచే వాళ్ళూ అమ్మానాన్నలూ...అన్నారు.
** చిన్నపుడెపుడో విన్న కధకు కొనసాగింపునిచ్చాను. బావుందాండి?

11 comments:

  1. చాలా బాగుందండీ! కదిలించింది. కానీ ఈ కాలంలో వీటిని పాటించే వారి సమాఖ్య తగ్గిందనే చెప్పాలి. మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు చూస్తే ఎంత బాగుంటుందో!

    ReplyDelete
  2. కథ చాలా బావుందండి.రియల్లీ హార్ట్ టచింగ్!

    ReplyDelete
  3. హాయిగా ఉంది కథ - హృదయమ్ము తాకి ,
    సత్య మావిష్కరించి , ప్రశాంతత నిడె -
    ముదిమి రెండవ బాల్యమౌ - మురిపె మరసి
    తల్లి దండ్రుల లాలించు తనయు లున్న .
    ----- సుజన-సృజన

    ReplyDelete
  4. చాలా బాగుంది.

    ReplyDelete
  5. ఈ చిన్నకధపై తమ స్పందనను తెలియచేసిన మిత్రులకు నా హృదయపూర్వకధన్యవాదాలు...
    పద్యంతో తమ స్పందనను తెలియచేసిన రాజారావు సర్ కి కృతజ్ఞతలు!

    ReplyDelete
  6. చాలా బాగుంది పరిమళం గారూ...మంచి భావనను పంచి యిచ్చారు...

    ReplyDelete