
తెలుగు వెలుగును ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహనీయులు వారు.వారి విగ్రహాలు తెలుగువారి వారసత్వ సంపద!వారసులం మనమే వాటిని కూల్చేసుకున్నామా?పంచభూతాల సాక్షిగా మహనీయుల విగ్రహాలు నేలకూలిన వేళ ....మనసు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ....టాంక్ బండపై ప్రతిజ్ఞ చేశారని టివిలో చూసినపుడు వీరంతా భారత పౌరులుగా మొదట చేసిన ప్రతిజ్ఞను మరిచారా ..లేక చిన్ననాడు వీరిచేత ఉపాధ్యాయులు కాని, తల్లితండ్రులు కాని ఈ ప్రతిజ్ఞను వల్లె వేయించలేదో తెలియలేదు.దుఃఖం వస్తోంది.అతి ప్రాచీనమని మురిసిపోయే మన నాగరికత ఇదేనాఅని!
స్కూళ్ళలో చెప్పిస్తున్నారోలేదో....ఒకవేళ చెప్పినా దాని అర్ధం వివరిస్తున్నారో లేక మొక్కుబడిగా చెబుతున్నారో తెలీదు.కనీసం తల్లితండ్రులైనా తప్పనిసరిగా తమ పిల్లలకు ఈ ప్రతిజ్ఞ నేర్పించి , అర్ధం వివరించి వారి మనసులో దేశభక్తి పెంపొందేలా చూడాలి.బాధ్యతాయుతమైన భారతీయ పౌరులుగా తీర్చి దిద్దాలి.
ప్రతిజ్ఞ
భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము.
దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని,
నేను నా తల్లితండ్రులనూ, ఉపాధ్యాయులనూ, పెద్దలందరినీ గౌరవింతునని,
నా దేశము పట్ల, దాని ప్రజల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉందునని ప్రతిఙ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.