Monday, June 25, 2012

మావూరి దేవుడు!

మా ఊరిలో కోదండరామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది.దాని వెనక చిన్నకధకూడావుంది. కధంటేకధకాదండోయ్ నిజంగా జరిగింది.చాలా ఏళ్ళక్రితం అంటే దాదాపు ఓ ఎనభై ఏళ్ళక్రితం సంగతి! ఒక కుమ్మరి కుండలుచేసుకుంటూ ఒకచిన్నగుడిశలో ఉండేవాడట!తర్వాత ఏమైందో అతను ఎక్కడికో వెళ్ళిపోయాడట!అతనిగుడిశ అలాగేఖాళీగా ఉండటం చూసి ఒక అవ్వమూడు కొయ్యముక్కలు పాతి వాటికి పసుపుకుంకుమ పెట్టి సీతారామలక్ష్మణులని పూజించేదట!కాలక్రమంలో అవ్వ చనిపోయినాగ్రామస్తులు ఆకొయ్యముక్కలనే రామునిగాభావించి ప్రతిశ్రీరామనవమికి కల్యాణం చేస్తున్నారట!ఇన్నేళ్ళకి గ్రామస్తులంతా అక్కడ చిన్నగుడికట్టి రాముడ్ని ప్రతిష్టించాలని సంకల్పించారు.సంకల్పం మాత్రమే మనది...కార్యభారం ఆయనదేకదా...అనుకున్నదే తడవుగా అందరూ తలోచేయివేసి గుడిపూర్తి చేశారు.ఇన్నాళ్ళుగా పూజలందుకున్నకొయ్యరాముడ్ని సముద్రంలోనిమజ్జనం చేసి ఆస్థానంలో కోదండరాముడ్ని ప్రతిష్టించారు.అన్న సంతర్పణ, కోలాటం, భజనలు, ఊరేగింపులు...వైభవంగా స్వామివారి ప్రతిష్ట జరిగింది.

సీతాలక్ష్మణసమేతరామచంద్రమూర్తిని మీరూచూడండి!






రామునివెంటే రాంబంటు!